కుప్పం టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-11-10T20:41:30+05:30 IST
కుప్పం టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీడీపీ ఆఫీస్కి మాజీమంత్రి అమర్నాథరెడ్డి వచ్చారు.
చిత్తూరు: కుప్పం టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీడీపీ ఆఫీస్కి మాజీమంత్రి అమర్నాథరెడ్డి వచ్చారు. అమర్నాథరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. హైకోర్టులో అమర్నాథరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ వచ్చేలోగా అమర్నాథరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసుల యత్నిస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ నేతల అరెస్టుల పర్వం మొదలైంది. పట్టణంలోని బీసీఎన్ రిసార్ట్స్లో బస చేసిన మాజీ మంత్రి అమరనాథ్రెడ్డిని, టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు మంగళవారం రాత్రి 11 గంటలకు అరెస్టు చేశారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రకాశ్ నామినేషన్ను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించుకున్నట్లు చూపడంతో సోమవారం రాత్రి టీడీపీ శ్రేణులు కుప్పం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే.