పర్చూరు వై జంక్షన్ దగ్గర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-06T23:59:33+05:30 IST

పర్చూరు వై జంక్షన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు స్థానికులు వచ్చారు

పర్చూరు వై జంక్షన్ దగ్గర ఉద్రిక్తత

ప్రకాశం: పర్చూరు వై జంక్షన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు స్థానికులు వచ్చారు. తమ వాహనాలను ఉదయం నుండి ఫొటోలు తీస్తున్నారంటూ పోలీసులతో స్థానికుల వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. తమపై కేసులు నమోదు చేస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం వరకు చేపట్టిన మహా పాదయాత్ర శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలో 14 రోజులుసాగే అమరావతి జేఏసీ మహా పాదయాత్రకు ప్రజానీకం పెద్దఎత్తున సంఘీభావం తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2021-11-06T23:59:33+05:30 IST