తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత..

ABN , First Publish Date - 2020-09-23T17:25:38+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన నేపథ్యంలో తిరుపతిలో...

తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత..

తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయాలని బీజేపీ, టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.


ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తాము ముఖ్యమంత్రిని రాజీనామా చేయమని అడగడంలేదని అన్నారు. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని కాపాడాలని అంటున్నామన్నారు. జగన్ జెరూసలేం యాత్రకు వెళ్లినప్పుడు కుటుంబ సమేతంగా వెళతారని, హిందూ దేవాలయాన్ని సందర్శించేటప్పుడు మాత్రం ఒక్కరే వస్తారని.. దీనికి కారణమేంటని వారు ప్రశ్నించారు. మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చినప్పుడు సంతకం చేశారని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని అంటున్నామని, హిందూమతంపై దాడిని ఆపాలని కోరుతున్నామని నేతలు వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-09-23T17:25:38+05:30 IST