టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు వేయాలి
ABN , First Publish Date - 2021-04-24T04:31:13+05:30 IST
కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్
అనకాపల్లి, ఏప్రిల్ 23: కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం విలేకరలతో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్రెడ్డి మెప్పు కోసం విద్యా శాఖ మంత్రి గందరగోళమైన ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయని గుర్తు చేశారు. పరీక్షలు నిర్వహిస్తే లక్షలాది మంది విద్యార్థులు కొవిడ్ బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పది, ఇంటర్ పరీక్షలు రద్దు లేదా వాయిదా వేయాలన్నారు. ఆయన వెంట టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు బోడి వెంకటరావు, ప్రధాన కార్యదర్శి కోట్ని రామకృష్ణ ఉన్నారు.