నిబంధనలు తుంగలో..

ABN , First Publish Date - 2021-05-10T04:19:18+05:30 IST

కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తున్న కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ని బంధనలు విధించినా ఆత్మకూరులో వ్యాపారులు, ప్రజలు పాటించడం లే దు.

నిబంధనలు తుంగలో..
ఆత్మకూర్‌లో కొనసాగుతున్న వారాంతపు సంత

- విచ్చలవిడిగా విక్రయాలు

ఆత్మకూరు, మే 9: కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తున్న కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ని బంధనలు విధించినా ఆత్మకూరులో వ్యాపారులు, ప్రజలు పాటించడం లే దు. పట్టణంలో ఆదివారం వారాంతపు సంత కావడంతో ఆయా గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. భౌతిక దూరం  పాటించ కుండా నిబంధనలను తుంగలో తొక్కి విచ్ఛలవిడిగా రోడ్లపై పర్యటించారు.   పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో వస్త్ర దుకా ణాలకు వినియోగదారులు పొటేత్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి స్వచ్ఛందంగా షాపు మూసివేసి నిబంధనలు పాటిం చాలని ము నిసిపల్‌ పాలకమండలి ఆదేశాలు జారీ చేసినా వీటి ని ఎవరూ పట్టించుకోలేదు. పట్టణానికి రోజువారిగా ప్రజలు అత్యధికంగా రావడంతో కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తే అవకాశముంది. మునిసిపల్‌ పా లక మండలి, వైద్య ఆరోగ్య సిబ్బంది పోలీసులు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-05-10T04:19:18+05:30 IST