శ్రీనగర్‌లో ఉగ్రదాడి... గాయపడిన జవాన్లు

ABN , First Publish Date - 2020-02-02T19:32:35+05:30 IST

నగర్‌లోని లాల్‌చౌక్ ఏరియాలో సీఆర్‌పీఏఫ్ సిబ్బంది లక్ష్యంగా ఆదివారంనాడు ఈ దాడి జరిగింది. రద్దీగా ఉండే లాల్ చౌక్ ప్రాంతంలోని..

శ్రీనగర్‌లో ఉగ్రదాడి... గాయపడిన జవాన్లు

సీఆర్‌పీఏఫ్ సిబ్బందిపై మరోసారి ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ఏరియాలో సీఆర్‌పీఏఫ్ సిబ్బంది లక్ష్యంగా ఆదివారంనాడు ఈ దాడి జరిగింది. రద్దీగా ఉండే లాల్ చౌక్ ప్రాంతంలోని ప్రతాప్ పార్క్ వద్ద విధి నిర్వహణలో ఉన్న సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి జరిపినట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో వారాంతపు (సండే) మార్కెట్ కోసం వచ్చిన జనం భయభ్రాంతులకు గురయ్యారని, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టారని అధికార వర్గాలు తెలిపాయి.


Updated Date - 2020-02-02T19:32:35+05:30 IST