Punjab: పాక్ ప్రేరేపిత ఉగ్రముఠా గుట్టురట్టు..ఇద్దరి అరెస్టు
ABN , First Publish Date - 2022-09-23T22:32:24+05:30 IST
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత టెర్రర్ మాడ్యూల్ను పంజాబ్..
చండీగఢ్: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) ప్రేరేపిత టెర్రర్ మాడ్యూల్ (Terror module)ను పంజాబ్ పోలీసులు శుక్రవారంనాడు ఛేదించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. కెనడాకు చెందిన లఖ్బీర్ లాండ, పాకిస్థాన్కు చెందిన హర్వీందర్ రిండా ఆదేశాలతో ఈ టెర్రర్ మాడ్యూల్ పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తుల నుంచి ఒక ఏకె-56 రైఫిల్, రెండు మ్యాగజైన్లు, 90 లైవ్ కాట్రిడ్జిలు స్వాధీనం చేసుకున్నట్టు పంజాబ్ పోలీసులు ఒక ట్వీట్లో తెలిపారు.
నేరాల నుంచి పంజాబ్ను విముక్తి చేయాలంటూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశాలతో టెర్రర్ మాడ్యాల్ గుట్టురట్టు చేశామని పంజాబ్ డీజీపీ తెలిపారు. మాడ్యూల్ మెంబర్లు ఇద్దర్ని అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.