జమ్మూ-కాశ్మీర్లో తీవ్రవాదుల అరెస్టు
ABN , First Publish Date - 2022-04-03T21:55:39+05:30 IST
జమ్మూ-కాశ్మీర్లో లష్కర్-ఇ-తొయిబాకు చెందిన రెండు తీవ్రవాద ముఠాల్ని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు సభ్యుల్నిఅరెస్టు చేశారు.
జమ్మూ-కాశ్మీర్లో లష్కర్-ఇ-తొయిబాకు చెందిన రెండు తీవ్రవాద ముఠాల్ని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు సభ్యుల్నిఅరెస్టు చేశారు. బందిపోరాలోని అష్టాంగో ప్రాంతంలో తీవ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు అనుబంధ సభ్యుల్ని అరెస్టు చేయగా, మరొక సభ్యుడిని రాఖ్ హజిన్ చెక్పోస్టు దగ్గర అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఇర్ఫాన్ అహ్మద్ భట్, సాజద్ అహ్మద్ మీర్, ఇర్ఫాన్ అహ్మద్ జన్, ఇర్ఫాన్ అజీజ్ భట్గా గుర్తించారు. నిందితుల్లో ఒకరి నుంచి చైనీస్ గ్రెనేడ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అజీజ్ భట్కు పాకిస్తాన్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హజిన్ ప్రాంతంలో టెర్రరిస్టు దాడులకు వీరు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ నలుగురికి సంబంధించి అందిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగి, పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.