ముంబైలో ఉగ్రదాడులు?.. పోలీసుల అప్రమత్తం
ABN , First Publish Date - 2021-12-31T08:54:38+05:30 IST
నూతన సంవత్సర వేడుకల వేళ ముంబైలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే చాన్స్ ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతను పెంచారు.
ముంబై, డిసెంబరు 30: నూతన సంవత్సర వేడుకల వేళ ముంబైలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే చాన్స్ ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతను పెంచారు. నగర పోలీసులందరికీ సెలవులు రద్దుచేసినట్లు ముంబై పోలీసు అధికారులు తెలిపారు. ముంబై, దాదర్, బాంద్రా చర్చ్గేట్, సీఎ్సఎంటీ, కుర్లాతో పాటు ఇతర ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంచినట్లు వివరించారు.