ముగ్గురు బీజేపీ నేతలను చంపిన ఉగ్రవాదులు

ABN , First Publish Date - 2020-10-30T08:21:02+05:30 IST

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు...

ముగ్గురు బీజేపీ నేతలను చంపిన ఉగ్రవాదులు

న్యూఢిల్లీ, అక్టోబరు 29: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ  ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు. మృతులను ఫిదా హుసేన్‌, ఉమర్‌ రషీద్‌, ఉమర్‌ రంజాన్‌ హాజంగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2020-10-30T08:21:02+05:30 IST