ముగ్గురు బీజేపీ నేతలను చంపిన ఉగ్రవాదులు
ABN , First Publish Date - 2020-10-30T08:21:02+05:30 IST
జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు...
న్యూఢిల్లీ, అక్టోబరు 29: జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు. మృతులను ఫిదా హుసేన్, ఉమర్ రషీద్, ఉమర్ రంజాన్ హాజంగా పోలీసులు గుర్తించారు.