ఎస్ఐ పదోన్నతులకు పరీక్షలు
ABN , First Publish Date - 2020-12-03T05:20:22+05:30 IST
ఎస్ఐ ట్రైనింగ్ కోసం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షను బుధవారం కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వు మైదానంలో నిర్వహించారు.
విశాలాక్షినగర్, డిసెంబరు 2: ఎస్ఐ ట్రైనింగ్ కోసం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షను బుధవారం కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వు మైదానంలో నిర్వహించారు. ఈ నెల 4 వరకు జరగనున్న పరీక్షలకు డీఐజీ రంగారావు చైర్మన్గా, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, 16వ బెటాలియన్ కమాడెంట్ డి.ఉదయ్భాస్కర్ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు డీఐజీ తెలిపారు. రాత పరీక్షలో నేర దర్యాప్తు, మౌఖిక, డ్రిల్ వంటి అంశాల్లో ప్రావీణ్యం పొందిన వారికి అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఉంటుందన్నారు. తొలిరోజు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 69 మంది హెచ్సీలు, ఏఎస్ఐలు పరీక్షకు హాజరయ్యారన్నారు.