లక్షణాలుంటే టెస్టులు తప్పని సరి

ABN , First Publish Date - 2022-01-21T05:22:11+05:30 IST

కొవిడ్‌ లక్షణాలుంటే తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి టెస్టులు చేయించుకోవాలని వైద్యాధికారి రవీందర్‌ పేర్కొన్నారు.

లక్షణాలుంటే టెస్టులు తప్పని సరి
నర్వ బస్టాండు వద్ద అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ విజయభాస్కర్‌

దామరగిద్ద, జనవరి 20 : కొవిడ్‌ లక్షణాలుంటే తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి టెస్టులు చేయించుకోవాలని వైద్యాధికారి రవీందర్‌ పేర్కొన్నారు. గురువారం వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కాన్‌కుర్తి చెక్‌పోస్టు వద్ద ప్రయాణికులకు కరోనా టెస్టులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబు తదితర లక్షణాలుంటే తక్షణమే టెస్టులు చేయించుకోవాలన్నారు. కాగా బస్సుల్లో ప్రయాణించే వారికి టెస్టులు చేసి పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారికి కిట్లు అందించేందుకు కిట్లను అందుబాటులో ఉంచుకున్నారు.  చెక్‌పోస్టు వద్ద 55మందికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ కేసులు రాలేదన్నారు. అదే విధంగా 343 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది సీహెచ్‌వో జమీల్‌ హైమద్‌, సూపర్‌ వైజర్‌ జానకమ్మ, ఆశ వర్కర్లు ఉన్నారు. 



Updated Date - 2022-01-21T05:22:11+05:30 IST