టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారికి రాష్ట్ర గవర్నర్ ద్వారా ప్రత్యేక గుర్తింపు

ABN , First Publish Date - 2022-04-03T14:04:46+05:30 IST

శ్రీ శుభ కృత్ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ 2022 ఏప్రిల్ 2వ తేదీని “తెలుగు భాషా వారసత్వ దినంగా” ప్రకటించారు.

టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారికి రాష్ట్ర గవర్నర్ ద్వారా ప్రత్యేక గుర్తింపు

డాలస్, టెక్సాస్: శ్రీ శుభ కృత్ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ 2022 ఏప్రిల్ 2వ తేదీని “తెలుగు భాషా వారసత్వ దినంగా” ప్రకటించారు. దీనిని తెలియజేస్తూ ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూరకు గవర్నర్ అబ్బాట్ ఆ అధికారిక ప్రకటన ప్రతిని అందజేశారు. 


“టెక్సాస్ రాష్ట్రంలో వివిధ నగరాలలో నివశిస్తున్న లక్షలాది తెలుగు కుటుంబాల వారు విభిన్న సంస్కృతుల వారితో మమేకమవుతూ విద్య, వైద్య, వాణిజ్య, ప్రభుత్వ, కళా రంగాలలో తెలుగువారు పోషిస్తున్నపాత్ర మరువలేనిది. తెలుగు వారికున్న క్రమశిక్షణ, కుటుంబ విలువల పట్ల గౌరవం, వృత్తిపట్ల నిభద్దత, విద్య పట్ల శ్రద్ధ ఇతరులకు ఆదర్శప్రాయం. టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని, వారు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి” అని గవర్నర్ ఆ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.  


డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. టెక్సాస్ రాష్ట్రంలో చిరకాలంగా నివశిస్తున్న తెలుగు వారి పట్ల ప్రత్యేక గౌరవం, శ్రద్ధ చూపుతున్న టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అబ్బాట్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గవర్నర్ తన శ్రీమతి సిసీలియాతో కలసి తెలుగు వారి ముఖ్యమైన పండుగ ఉగాదిని “తెలుగు భాషా వారసత్వ దినంగా” ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి అని అన్నారు. తెలుగు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినందుకు టెక్సాస్ రాష్ట్ర తెలుగు ప్రజలందరి తరపున గవర్నర్ దంపతులకు ప్రసాద్ తోటకూర హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 



Updated Date - 2022-04-03T14:04:46+05:30 IST