పాఠ్యపుస్తకాలు పంపిణీ
ABN , First Publish Date - 2021-06-23T03:39:00+05:30 IST
మండలంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను మంగళవారం ఎంఈవో మస్తాన్వలి పంపిణీ చేశారు.
సీతారామపురం, జూన్ 22 : మండలంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను మంగళవారం ఎంఈవో మస్తాన్వలి పంపిణీ చేశారు. తొలి విడతగా 11,809 పాఠ్యపుస్తకాలు ఎమ్మార్సీకి చేరగా వాటిని తరగతుల వారీగా వేరుచేసి ఆయా పాఠశాలలకు అందించామన్నారు. పాఠశాలలు ప్రారంభమమ్యేనాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలను అందిస్తామని, జగనన్న విద్యాకానుక కిట్లను కూడా పాఠశాలలకు పంపిణీ జరుగుతుందన్నారు.