అత్తపై అల్లుడు దాడి

ABN , First Publish Date - 2022-05-18T04:00:56+05:30 IST

కావలి పట్టణం ఉదయగిరి రోడ్డులో మంగళవారం అత్తపై అల్లుడు కర్రతో దాడి చేయడంతో పాటు ఆటోతో గుద్ది పరారయ్యాడు.

అత్తపై అల్లుడు దాడి
బాధితురాలిని 108 వాహనంలో వైద్యశాలకు తరలిస్తున్న సీఐ మల్లికార్జునరావు

కావలి రూరల్‌, మే 17: కావలి పట్టణం ఉదయగిరి రోడ్డులో మంగళవారం అత్తపై అల్లుడు కర్రతో దాడి చేయడంతో పాటు ఆటోతో గుద్ది పరారయ్యాడు. రెండొవ పట్టణ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని బాలక్రిష్ణారెడ్డి నగర్‌కు చెందిన వంశీకృష్ణతో జలదంకి మండలం జమ్మలపాలెంకు చెందిన తన్నీరు రత్న తన కుమార్తె రోజాకు రెండేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా ఏడాది నుంచి రోజా జమ్మలపాలెంలో తన తల్లి వద్ద ఉంటుంది. రత్న ఉదయగిరి రోడ్డులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల ఎదురుగా ఉన్న హాటల్‌లో పనిచేస్తుండగా మంగళవారం ఆటో వేసుకుని అక్కడకు వచ్చిన అల్లుడు వంశీకృష్ణ మామధ్య గొడవలకు నువ్వే కారణం అని అత్తను దూషిస్తూ ఆటోలో తెచ్చుకున్న కర్రతో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆటోతో గుద్ది పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఏరియా వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-05-18T04:00:56+05:30 IST