గుర్ల తహసీల్దారుపై సస్పెన్షన వేటు
ABN , First Publish Date - 2020-11-28T03:59:28+05:30 IST
గుర్ల తహసీల్దారు కల్పవల్లిపై సస్పెన్షన వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ హరిజవహర్లాల్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. దేవునికణపాక, కొండగండ్రేడులో భూ ఆక్రమణలపై ‘కొండలు బెదురుతున్నాయ్’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విజయనగరం ఆర్డీవో భవానీశంకర్ గురువారం విచారణ చేపట్టారు.
ఆర్ఐకి విమానాశ్రయ భూసేకరణకు బదిలీ
వీఆర్వో, వీఆర్ఏలకు షోకాజ్ నోటీసులు
భూఆక్రమణల ఆరోపణలే కారణం
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
గుర్ల, నవంబరు 27:
గుర్ల తహసీల్దారు కల్పవల్లిపై సస్పెన్షన వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ హరిజవహర్లాల్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. దేవునికణపాక, కొండగండ్రేడులో భూ ఆక్రమణలపై ‘కొండలు బెదురుతున్నాయ్’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విజయనగరం ఆర్డీవో భవానీశంకర్ గురువారం విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్కు అందించారు. దీంతో తహసీల్దారుపై సస్పెన్షన వేటు పడగా..ఆర్ఐ జోగినాయుడును భోగాపురం విమానాశ్రయ భూసేకరణ విభాగానికి బదిలీ చేశారు. వీఆర్వో నవీన, వీఆర్ఏ బంగారమ్మకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఇదిలా ఉంటే ఈ భూములు రిజర్వేషన్ ఎలా జరిగింది అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పక్కనే అటవీ శాఖ భూములను ఆక్రమించుకున్న వారిపై కేసులు నమోదుచేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరికొంత మంది అధికారులు, సిబ్బందిపై వేటుపడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
11111111111111111111111111111111111111111111111111111111111111111