మళ్లీ ఆ ఇద్దరే

ABN , First Publish Date - 2021-01-25T09:18:22+05:30 IST

గతవారం యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సింగిల్స్‌ విజేతలుగా నిలిచిన కరోలినా మారిన్‌, విక్టర్‌ అక్సెల్‌సన్‌ తర్వాతి ఈవెంట్‌లోనూ సత్తాచాటారు...

మళ్లీ ఆ ఇద్దరే

బ్యాంకాక్‌: గతవారం యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సింగిల్స్‌ విజేతలుగా నిలిచిన కరోలినా మారిన్‌, విక్టర్‌ అక్సెల్‌సన్‌ తర్వాతి ఈవెంట్‌లోనూ సత్తాచాటారు. ఆదివారం ముగిసిన టొయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌లోనూ టైటిళ్లు సాధించి వహ్‌వా అనిపించారు. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ 21-19, 21-17తో టాప్‌సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచి ట్రోఫీ అందుకుంది. పురుషుల తుది పోరులో డెన్మార్క్‌ స్టార్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ 21-11, 21-7తో తన దేశానికే చెందిన హన్స్‌ క్రిస్టీన్‌ సోల్‌బర్గ్‌పై నెగ్గాడు. 

Updated Date - 2021-01-25T09:18:22+05:30 IST