మెక్సికో బస్సు ప్రమాదంలో 13 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2020-09-29T11:53:32+05:30 IST

వేగంగా వస్తున్న ఓ బస్సు గోడను ఢీకొన్న ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మరణించిన ఘటన....

మెక్సికో బస్సు ప్రమాదంలో 13 మంది దుర్మరణం

మెక్సికో సిటీ (మెక్సికో): వేగంగా వస్తున్న ఓ బస్సు గోడను ఢీకొన్న ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మరణించిన ఘటన మెక్సికో దేశంలోని మెక్సికో నగరంలో జరిగింది. మెక్సికో దేశంలోని లా ట్రినిటారియా, ఫ్రంటెరా కోమాలపా పట్టణాల మధ్య తిరిగే ఓ ప్రయాణికుల బస్సు వేగంగా వస్తూ గోడను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మహిళలతో కలిసి మొత్తం 13 మంది మరణించారని మెక్సికో స్టేట్ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పారు. ఈ దుర్ఘటనలో మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ బస్సు ప్రమాద ఘటనపై మెక్సికో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-29T11:53:32+05:30 IST