అది బూటకపు Encounter: Pro. హరగోపాల్
ABN , First Publish Date - 2022-05-20T23:17:54+05:30 IST
దిశ ఎన్కౌంటర్ బూటకమని పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. దిశ ఘటనలో నిందితులను చంపేయాలని సమాజం నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు
హైదరాబాద్: దిశ ఎన్కౌంటర్ బూటకమని పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. దిశ ఘటనలో నిందితులను చంపేయాలని సమాజం నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు ఎన్కౌంటర్ చేశారని ఆయన ఏబీఎన్తో చెప్పారు. 40 ఏళ్లుగా బూటకపు ఎన్కౌంటర్లపై పోరాడుతున్నామన్నారు. దిశ ఎన్కౌంటర్ కేసుకు మావోయిస్టుల ఎన్కౌంటర్లకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. మావోల వద్ద ఆయుధాలు ఉంటాయి కాబట్టి పోలీసులు కట్టుకథలు చెప్పి, ఎదురుకాల్పులు పేరుతో కేసులు మూసివేస్తారని, దిశ కేసులో పోలీసులు చట్టాన్ని చేతికి తీసుకొని ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. తప్పు చేసిన నిందితులకు శిక్ష పడాలంటే, పోలీసులు సరైన ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందు పెట్టాలని సూచించారు. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి, నిందితులు పేదవాళ్లు కాబట్టే పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని అభిప్రాయపడ్డారు.