అది వైసీపీ ప్లీనరీ కాదు.. Drama గ్యాలరీ: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-07-08T21:38:56+05:30 IST

Amaravathi: అది వైసీపీ ప్లీనరీ కాదు.. డ్రామా గ్యాలరీ అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్లీనరీ పేరుతో వైసీపీ అధికార దుర్వినియోగం పాల్పడిందని

అది వైసీపీ ప్లీనరీ కాదు..  Drama గ్యాలరీ: అచ్చెన్నాయుడు

Amaravathi: అది వైసీపీ ప్లీనరీ కాదు.. డ్రామా గ్యాలరీ అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్లీనరీ పేరుతో వైసీపీ అధికార దుర్వినియోగం పాల్పడిందని  ఆరోపించారు. రెండ్రోజుల ప్లీనరీతో ఆర్టీసీకి రూ.10 కోట్లు నష్టమని, ఇప్పటికే  నష్టాల్లో ఉన్న ఆర్టీసీ 3 సార్లు చార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల సభలకు అడ్డంకులు సృష్టించే ప్రభుత్వం, నేడు వైసీపీ ప్లీనరీకి సపర్యలు చేస్తోందన్నారు. రాజధాని రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వని అధికారులు.. ప్లీనరీకి మాత్రం రెడ్ కార్పెట్ వేసి మరీ సేవలు చేస్తున్నారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలను బెదిరించి ప్లీనరీకి తరలిస్తుండడం అన్యాయమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున వర్సిటీకి సెలవులిచ్చారని పేర్కొన్నారు.  

Updated Date - 2022-07-08T21:38:56+05:30 IST