రాబోయే కాలం ఎర్రజెండాదే : తమ్మినేని
ABN , First Publish Date - 2021-03-07T04:26:28+05:30 IST
కలుషిత రాజకీ యాలను చూసి ప్రజలు ఎర్రజెండా వైపు చూ స్తున్నారు. రాబోయే కాలం ఎర్రజెండాదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
వీపనగండ్ల, మార్చి 6: కలుషిత రాజకీ యాలను చూసి ప్రజలు ఎర్రజెండా వైపు చూ స్తున్నారు. రాబోయే కాలం ఎర్రజెండాదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం మండలంలోని బొల్లారంలో కామ్రెడ్ లక్ష్మి సంస్మరణ సభను మండల కార్య దర్శి డి.బాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు తెలుగు రాష్ర్టాల కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, మధు, జిల్లా కార్యదర్శి జబ్బార్లు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ దేశంలో మోదీ మతం పేరుతో, రాష్ట్రం లో తెలంగాణ సెంటిమెంట్తో కేసీఆర్ ప్రజల ను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మధు మాట్లాడుతూ భూస్వాముల అక్రమాలపై పో రాడిన గడ్డ ఈ ప్రాంతమని, స్వర్గీయ ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు గుమ్మడం గ్రామానికి వచ్చినప్పుడు కరవుతో అల్లాడుతున్న ప్రజలను చూసి రూ. 75 వృద్ధ్యాప్య పెన్షన్ మొట్ట మొ దటగా ఇక్కడి నుంచే ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్రకార్యదర్శి సా యిబాబు, సీపీఎం నాయకులు డీజీ నర్సింగరా వు, జయలక్ష్మి, పార్టీ నాయకులు భాస్కర్రెడ్డి, నాగిరెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.