ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-09T05:51:55+05:30 IST

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యమని ఎస్పీ రాహూల్‌హెగ్డే అన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

- ఎస్పీ రాహూల్‌హెగ్డే 

సిరిసిల్ల క్రైం, ఆగస్టు 8: ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యమని ఎస్పీ రాహూల్‌హెగ్డే అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్‌లో తొమ్మిది ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులు పెండింగ్‌ పడకుండా చూడడమే కాకుండా చట్టప్రకారం సమస్యలు పరిష్కరించాలని సంబం ధిత ఎస్‌హెచ్‌వోలను ఆదేశించామన్నారు. సివిల్‌ సమస్యల ను కోర్టులో పరిష్కరించుకోవాలని భూ వ్యవహారాల్లో బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 


Updated Date - 2022-08-09T05:51:55+05:30 IST