గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2021-05-11T04:51:57+05:30 IST
రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ప్రసాద్రెడ్డి పేర్కొన్నారు.
నందలూరు, మే10 : రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలలోని పాటూరు పంచాయతీ పరిధిలో రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తేవడంతో ఆయన వీరి సమస్యలను పరిశీలించారు. పాటూరు పంచాయతీలో అధికారు లు, మిల్లర్ల మధ్య సమన్వయలోపం వల్ల కొనుగోలు ఆలస్యం అయ్యిందన్నారు. రెండు, మూడు రోజులలో ధాన్యం అంతా కొనుగోలు చేస్తామన్నారు. డీసీఎం జూనియర్ అసిస్టెంట్ తిరుపాల్రెడ్డి, డీసీఎం మండల ఇన్చార్జి ఇక్బాల్, ఆర్.బి.కె ఇన్చార్జి సాయిప్రియ, పాటూరు సర్పంచ్ మోహన్రెడ్డి, రైతులు శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.