నాలుగున మంత్రి కేటీఆర్ రాక
ABN , First Publish Date - 2022-05-22T05:57:46+05:30 IST
ఐటీ, పురపాలశాఖ మంత్రి కే తారకరామారావు జూన్ 4వ తేదీన దేవరకద్ర నియోజవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేయడానికి వస్తున్నందున ఏర్పాటు చేసే బహిరంగ సభను జయ ప్రదం చేయాలని మునిసిపల్ చైర్మన్ బస్వరాజుగౌడ్ అన్నారు.
- బహిరంగ సభను విజయవంతం చేయాలి
- మునిసిపల్ చైర్మన్ బస్వరాజుగౌడ్
భూత్పూర్, మే 21 : ఐటీ, పురపాలశాఖ మంత్రి కే తారకరామారావు జూన్ 4వ తేదీన దేవరకద్ర నియోజవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేయడానికి వస్తున్నందున ఏర్పాటు చేసే బహిరంగ సభను జయ ప్రదం చేయాలని మునిసిపల్ చైర్మన్ బస్వరాజుగౌడ్ అన్నారు. భూత్పూర్ మునిసిపాలిటీలో రూ.117కోట్లతో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. శనివారం మునిసిపాలిటీ పరిధిలోని వికాస్ సీడ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశానికి మునిసిపల్ చైర్మన్ బస్వరాజుగౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, ముడా డైరెక్టర్ చంద్రశేఖర్గౌడ్ తదితరులు ముఖ్య అథిలుగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, ముడా డైరెక్టర్ చంద్రశేఖర్గౌడ్నాయకులు నారాయణగౌడ్, వైస్ ఎంపీపీ నరేష్, ముడా డైరెక్టర్ సాయిలు, మునిసి పల్ కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, పార్టీ సీనియర్ నాయకులు మురళీధర్గౌడ్, రామునాయక్, గడ్డం ప్రేమ్కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.