ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి

ABN , First Publish Date - 2021-02-28T05:30:00+05:30 IST

ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి
సమావేశంలో మాట్లాడుతున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి


పటాన్‌చెరు, ఫిబ్రవరి 28: ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పటాన్‌చెరు జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో పటాన్‌చెరు, రామచంద్రాపురం గత కార్పొరేటర్లకు వీడ్కోలు పలికి, కొత్త కార్పొరేర్లలకు స్వాగత ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల వరకే పార్టీలని, పార్టీలు వేరైనా నాయకులందరి లక్ష్యం ప్రజాసేవయే అన్నారు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాజకీయ నాయకుల మధ్య బేధాభిప్రాయాలు అభివృద్ధికి అడ్డంకిగా మారకూడదని హితవు పాలికారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరం వేగంగా విస్తరిస్తుండడంతో ప్రజలకు వసతులు కల్పించడం పెద్ద సవాలుగా మారిందన్నారు. పట్టణాభివృద్ధికి గత కార్పొరేటర్లు ఎంతో సహకరించారని, కొత్తగా గెలుపొందినవారు కూడా ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. మాజీ కార్పొరేటర్లు శంకర్‌యాదవ్‌, అంజయ్యయాదవ్‌ మాట్లాడుతూ ఐదేళ్ల తమ పదవీకాలం సంతృప్తినిచ్చిందన్నారు. అనంతరం పాత, కొత్త కార్పొరేటర్లను ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. 

Updated Date - 2021-02-28T05:30:00+05:30 IST