జ్యోతిషుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-02-28T05:42:18+05:30 IST
నాయకుల బెదిరింపులకు ఈ నెల 9న ఆత్మహత్యాయత్నం చేసిన విజయనగరం జిల్లా గరివిడి మండలం కోడూరు పంచాయతీకి చెందిన జ్యోతిషుడు ఇజ్జిపురపు భవానీ ప్రసాద్ (22) శనివారం మృతిచెందాడు.
గరివిడి, ఫిబ్రవరి 27: నాయకుల బెదిరింపులకు ఈ నెల 9న ఆత్మహత్యాయత్నం చేసిన విజయనగరం జిల్లా గరివిడి మండలం కోడూరు పంచాయతీకి చెందిన జ్యోతిషుడు ఇజ్జిపురపు భవానీ ప్రసాద్ (22) శనివారం మృతిచెందాడు. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. పంచాయతీ ఎన్నికల ముందు కోడూరులో టీడీపీ మద్ద తు అభ్యర్థి విజయం సాధిస్తాడని ఈయన జోతిషం చెప్పాడు. దీనిపై వైసీపీ నేతలు ప్రసాద్ను బెదిరించినట్లు ఆరోపణ ఉంది. ఆ భయంతోనే మనస్థాపం చెందిన ప్రసాద్ ఈ నెల 9న గరివిడి సినిమా హాల్ సెంటర్ వద్ద ఉదయం 10 గంటల సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటి నుంచి విజయనగరం, విశాఖ పట్టణంలోని ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన భవానీప్రసాద్ పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.