భర్త బయటికెళ్లగానే భార్య రోజూ ప్రియుడితో బిజీ.. ఫైనల్‌గా ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-10-31T22:20:53+05:30 IST

రాజేంద్రనగర్, శివరాంపల్లికి చెందిన షేక్‌ ఆదిల్‌ అలియాస్‌ నరేష్‌ (35)కు ఇద్దరు భార్యలు. పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. మొదటి భార్య జోయాబేగం సైదాబాద్‌ మోయిన్‌బాగ్‌లో ఒక్కటి నివాసం ఉంటోంది. భర్త తరచూ వెళ్లి వస్తుండేవాడు. అయితే ఈ క్రమంలో

భర్త బయటికెళ్లగానే భార్య రోజూ ప్రియుడితో బిజీ.. ఫైనల్‌గా ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి ఆమె ఏం చేసిందంటే..

సంసారంలో భార్యాభర్తలు తప్పులు చేసినా.. అవి సరిదిద్దుకునేవిగా ఉండాలి. చేయరాని తప్పులు చేస్తే.. చివరకు సంసారం నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. అయినా ఎక్కడో చోట భర్తనో లేక భార్యనో తప్పులు చేస్తుంటారు. విషయం బయటకు తెలిశాక ఎంత పశ్చాతపపడినా ప్రయోజనం ఉండదని చివరకు తెలుసుకుంటారు. హైదారాబాద్‌లో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. భర్త రోజూ పాల వ్యాపారం నిమిత్తం బయటికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో భార్య పక్కింటి కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓ ప్రియుడు, మరో ముగ్గురిని ఇంటికి పిలిచింది. తర్వాత ఆమె చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు.. వివరాల్లోకి వెళితే..


రాజేంద్రనగర్, శివరాంపల్లికి చెందిన షేక్‌ ఆదిల్‌ అలియాస్‌ నరేష్‌ (35)కు ఇద్దరు భార్యలు. పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. మొదటి భార్య జోయాబేగం సైదాబాద్‌ మోయిన్‌బాగ్‌లో ఒక్కటి నివాసం ఉంటోంది. భర్త తరచూ వెళ్లి వస్తుండేవాడు. అయితే ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉండే సయ్యద్‌ ఫరీద్‌ అలీ అలియాస్‌ సోహైల్‌ (27)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త రానుకాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడిపించారు. కొన్నాళ్లకు భర్తకు విషయం తెలియడంతో భార్యను మందలించాడు. అయినా ఆమె పద్ధతిలో మార్పు రాలేదు. ఈ విషయమై రోజూ ఇంట్లో గొడవలు జరిగేవి. భర్త వేధిస్తున్నాడనే విషయాన్ని ప్రియుడితో చెప్పడంతో అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు.


భర్తను చంపేస్తే తమకు అడ్డు లేకుండా ఉంటుందని భార్య, ఆమె ప్రియుడు ప్లాన్ వేశారు. ఇందుకోసం ఫరీద్‌ అలీ.. తన స్నేహితులు ముహమ్మద్‌ రియాజ్, షేక్‌ మావియా, మహ్మద్‌ జహీర్‌‌ను పిలిపించాడు. ఈ నెల 19 న రాత్రి జోయాబేగం ఇంటికి చేరుకున్నారు. నిద్రపోతున్న ఆదిల్‌ మెడకు చన్నీ బిగించి, కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతంర మృతదేహాన్ని పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మామిడిపల్లి రోడ్డులో తగులబెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించారు. మృతుడి భార్య, ఆమె ప్రియుడితో పాటు హత్యకు సహకరించిన ముగ్గురినీ అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శనివారం రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు.

Updated Date - 2021-10-31T22:20:53+05:30 IST