పదేళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు కూతుళ్లు కూడా.. ఆమె చేసిన ఒకే ఒక్క తప్పుతో జరగకూడని ఘోరం..!

ABN , First Publish Date - 2021-11-24T21:18:18+05:30 IST

చిన్న చిన్న తప్పులైతే సరిదిద్దుకోవచ్చు. కానీ కొందరు, సరిదిద్దుకోవడానికి వీలు లేని తప్పులన్నీ చేసేస్తుంటారు. కర్ణాటకలో ఓ మహిళ చేసిన ఒకే ఒక తప్పు.. చివరికి ఎంతటి ఘోరానికి దారి తీసిందో తెలుసుకుందాం..

పదేళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు కూతుళ్లు కూడా.. ఆమె చేసిన ఒకే ఒక్క తప్పుతో జరగకూడని ఘోరం..!
రాజేశ్వరి (ఫైల్)

ఒకే ఒక్క తప్పే.. ఒక్కోసారి జీవితాన్ని మొత్తం చిన్నాభిన్నం చేస్తుంది. ఈ విషయం తెలీక చాలా మంది తప్పులు మీద తప్పులు చేస్తుంటారు. ఏదో రోజు అన్నీ ఒకేసారి చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తాయనే విషయం.. చివరికి తెలుసుకుంటారు. చిన్న చిన్న తప్పులైతే సరిదిద్దుకోవచ్చు. కానీ కొందరు, సరిదిద్దుకోవడానికి వీలు లేని తప్పులన్నీ చేసేస్తుంటారు. కర్ణాటకలో ఓ మహిళ చేసిన ఒకే ఒక తప్పు.. చివరికి ఎంతటి ఘోరానికి దారి తీసిందో తెలుసుకుందాం..


కర్ణాటక శిడ్లఘట్ట పట్టణంలోని మారమ్మ దేవాలయం సర్కిల్లో నివాసం ఉంటున్న వెంకటేష్, రాజేశ్వరి(35) దంపతులు. వీరికి పెళ్లయి పదేళ్లయింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాడుగ ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. పిల్లలు బాగా చదివి, మంచి ఉద్యోగంలో స్థిరపడితే చూడాలని వెంకటేష్ నిత్యం తపన పడేవాడు. ఈ సమయంలో భర్తకు తోడుగా ఉంటూ పిల్లలకు ప్రేమ పంచాల్సిన రాజేశ్వరి.. చేయరాని తప్పు చేసింది.


శిడ్లఘట్టలోనే ఉంటున్న అనంత్‌కుమార్ అనే వ్యక్తి.. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో రాజేశ్వరితో పరిచయం పెంచుకున్నాడు. ఓ రోజు నువ్వంటే ఇష్టమంటూ మాట కలిపాడు. తిరస్కరించాల్సిన రాజేశ్వరి.. అతని మాయలో పడింది. రోజూ అతనితో మాట్లాడుతూ ఉండేది. ఇలా నాలుగేళ్లుగా వారి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ నెల 21వ తేదీన ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన రాజేశ్వరి.. మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. భార్యను అలాంటి పరిస్థితిలో చూసిన వెంకటేష్ బోరున విలపించాడు. తన భార్యను అనంత్‌కుమారే హత్య చేశాడని ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం అనంత్‌కుమార్ పరారీలో ఉన్నాడు.

Updated Date - 2021-11-24T21:18:18+05:30 IST