రెడ్ల రణభేరిని విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-03-07T05:19:59+05:30 IST

రెడ్డి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యం లో ఆదివారం హైదరాబాద్‌లోని కోంపల్లిలో నిర్వహిస్తున్న రెడ్ల రణభేరి సభలో ప్రతి ఒక్క రెడ్డి పాల్గొని విజయవం తం చేయాలని ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యాక్షుడు, జిల్లా అ ధ్యక్షుడు నల్లవెల్లి కరుణాకర్‌రెడ్డి, అంతిరెడ్డి విజయపాల్‌రె డ్డి కోరారు.

రెడ్ల రణభేరిని విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న రెడ్డి సంఘం నాయకులు

రెడ్డి సంఘం నాయకుల పిలుపు

ఖిల్లా, మార్చి 6 : రెడ్డి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యం లో ఆదివారం హైదరాబాద్‌లోని కోంపల్లిలో నిర్వహిస్తున్న రెడ్ల రణభేరి సభలో ప్రతి ఒక్క రెడ్డి పాల్గొని విజయవం తం చేయాలని ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యాక్షుడు, జిల్లా అ ధ్యక్షుడు నల్లవెల్లి కరుణాకర్‌రెడ్డి, అంతిరెడ్డి విజయపాల్‌రె డ్డి కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతీ రెడ్డి బిడ్డ కుటుంబసమేతంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని వారు కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘభవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభలో రెడ్డి కార్పొరేషన్‌లాంటి అనేక సమస్యలపై ప్రభుత్వానికి తెలియజేయనున్నామన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈగ రమేష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మేకా బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T05:19:59+05:30 IST