బైక్‌ అదుపు తప్పి పడి తాపీమేస్ర్తీ మృతి

ABN , First Publish Date - 2021-05-11T05:44:03+05:30 IST

బైక్‌ అదుపుతప్పి పడి స్తంభానికి గుద్దుకుని తాపీమేస్ర్తీ మృతిచెందిన సంఘటన కంది మండల పరిధిలోని ఓడీఎ్‌ఫలో సోమవారం చోటుచేసుకుంది.

బైక్‌ అదుపు తప్పి పడి తాపీమేస్ర్తీ మృతి

కంది, మే 10: బైక్‌ అదుపుతప్పి పడి స్తంభానికి గుద్దుకుని తాపీమేస్ర్తీ మృతిచెందిన సంఘటన కంది మండల పరిధిలోని ఓడీఎ్‌ఫలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజే్‌షనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం..కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్దతక్కెడపల్లికి చెందిన ముస్తాఫా(32) శంకర్‌పల్లిలో తాపీమేస్త్రీ పనులు చేసుకుంటూ భార్యపిల్లలతో కలిసి సింగాపురంలో నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం 8గంటలకు తన భార్యపిల్లలను సొంతూరు వెళ్లేందుకు బస్సు ఎక్కించాడు. అనంతరం ముస్తాఫా కూడా తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మార్గంమధ్యలో ఓడీఎఫ్‌ సమీపంలో బండి అదుపుతప్పి ఓ కరెంటు స్తంభానికి గుద్దుకోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దవడ పగిలి, ముక్కులోంచి తీవ్రరక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ముల్తానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.  

Updated Date - 2021-05-11T05:44:03+05:30 IST