బీజేపీ, టీఆర్ఎస్లు ఒకే గూటి పక్షులు
ABN , First Publish Date - 2022-01-20T06:47:54+05:30 IST
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్లు ఒకే గూటి పక్షులని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు.
టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్
శాలిగౌరారం, జనవరి 19: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్లు ఒకే గూటి పక్షులని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. బుధవారం మండలంలోని వల్లాల, ఆకారం, శాలిగౌరా రం, గురజాలలో ఏఐసీసీ లంబాడ హక్కుల వైస్ చైర్మన్ బెల్లయ్యనాయక్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, ధనుంజయ, షేక్ ఇంతియాజ్, స మరంరెడ్డి, పరమే్షగౌడ్, పుల్లయ్య, అశోక్, లక్ష్మీనారాయణ, శేఖర్ పాల్గొన్నారు.