బీజేపీ మహసభను జయప్రదం చేయాలి
ABN , First Publish Date - 2022-06-28T04:32:41+05:30 IST
హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జూలై3న జరిగే బీజేపీ మహాసభను విజయవంతం చేయాలని ఆపార్టీ జిల్లా అధ్య క్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన కాగజ్నగర్,దహెగాం, పెంచికల్పేట మండలాల్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
-జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్
కాగజ్నగర్ టౌన్/దహెగాం/పెంచికలపేట, జూన్ 27: హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జూలై3న జరిగే బీజేపీ మహాసభను విజయవంతం చేయాలని ఆపార్టీ జిల్లా అధ్య క్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన కాగజ్నగర్,దహెగాం, పెంచికల్పేట మండలాల్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈమహాసభకు ప్రధానిమోదీతో హాజరు కానున్నారన్నారు. ఈనెల28న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్కుమార్ పూజా కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. స్థానికంగా ఆయా మండల కేంద్రాల్లోనూ జెండా ఆవిష్కరించాలన్నారు. ఇందులో భాగంగా ఈనెల30న మాజీ మంత్రి పంకజ్ముండే కాగజ్నగర్ రానున్నట్లు తెలిపారు. అలాగే జూలై2,3 తేదీల్లో బీజేపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉంటాయన్నారు. ప్రధాని మోదీ హాజరుకానున్న బీజేపి బహిరంగ సభను జయప్రదం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని ఆయన కోరారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి రాజమౌళి, నాయకులు డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు, కొంగ సత్యనారాయణ, వీరభద్రాచారి, గోలెం వెంకటేశ్, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి ఆత్మరాం నాయక్, సొల్లు లక్ష్మి, మాచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.