కాలువలో యువకుడి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-05-22T06:26:41+05:30 IST

మండలంలోని తురకవారిపల్లికి చెందిన కొంకా నాగార్జున(23) అనే యువకుడి మృతదేహం శనివారం లభ్యమైంది.

కాలువలో యువకుడి మృతదేహం లభ్యం
కొంకా నాగార్జున(ఫైల్‌)



తాడిమర్రి, మే 21: మండలంలోని తురకవారిపల్లికి చెందిన కొంకా నాగార్జున(23) అనే యువకుడి మృతదేహం శనివారం లభ్యమైంది. చిత్రావతి రిజర్వాయర్‌ నుంచి పులివెందులకు నీరు వెళ్లే లింగాల కుడికాలువలో పార్నపల్లి సమీ పంలో గుర్తుతెలియని మృతదేహం కనిపిస్తోం దంటూ వదంతులు వచ్చాయి. దీంతో అక్కడికి వెళ్లిన కుటుంబసభ్యులు మృతదేహం నాగార్జునదే అని గుర్తించారు. నాగార్జున లింగాల మండలం ఇప్పట్ల వద్దగల సిమెంట్‌ సంచుల తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవాడు. అతడు తరచూ మూడు నాలుగు రోజుల పాటు ఇంటికి వచ్చేవాడు కాదని, దీంతో ఇప్పుడు కూడా అలాగే వస్తాడని అనుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే శనివారం లింగాలకుడికాలువ నీటిలో శవమై తేలాడు. అక్కడ సమీపంలోనే నాగార్జున వాడే ద్విచక్రవాహనం ఉన్నట్టు వదంతులు షికారు చేస్తున్నాయి. కాగా మృతదేహం లభ్యమైన ప్రాంతం కడపజిల్లా లింగాల పోలీస్‌స్టేషన పరిధికి రావడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి తండ్రి శివయ్య, తల్లి వెంకటలక్ష్మి, అన్న మల్లికార్జున ఉన్నారు.



Updated Date - 2022-05-22T06:26:41+05:30 IST