Kurnool: విద్యుత్ ఆర్త్ వైర్ తగిలి బాలుడు మృతి

ABN , First Publish Date - 2022-04-29T14:03:34+05:30 IST

జిల్లాలోని కౌతాళం మండలం ఏరిగేరి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Kurnool: విద్యుత్ ఆర్త్ వైర్ తగిలి బాలుడు మృతి

కర్నూలు: జిల్లాలోని కౌతాళం మండలం ఏరిగేరి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఆర్త్ వైర్ తగిలి సాయికుమార్(4) అనే బాలుడు మృతి చెందాడు. గత రాత్రి బాలుడిని తల్లిదండ్రులు ఇంటి గుమ్మం దగ్గర పడుకోబెట్టారు. అయితే ఆర్త్ వైర్ ఇంటికి ఉన్న ఇనుప తలుపుకు తగలడంతో పక్కన పడుకున్న బాలుడు పక్కకు ఒరగడంతో విద్యుత్ ఘాతానికి గురై నిద్రలోనే మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2022-04-29T14:03:34+05:30 IST