డెంగ్యూతో బాలుడు మృతి
ABN , First Publish Date - 2021-09-14T22:58:03+05:30 IST
జిల్లాలోని సీతానగరం వేదాస్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడు(
రాజమండ్రి: జిల్లాలోని సీతానగరం వేదాస్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడు(12) డెంగ్యూతో మృతి చెందాడు. ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో బాలుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెరుగైన వైద్యం చేయనందు వల్లే ప్లేట్లెట్స్ పడిపోయి బాలుడు మృతి చెందాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆసుపత్రి వద్ద పరిస్థితి అదుపు చేసేందుకు సీతానగరం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.