పాముకాటుకు బాలుడు మృతి
ABN , First Publish Date - 2021-05-11T04:45:32+05:30 IST
మండల కేంద్రమైన రామాపురంలో నివాసం ఉంటున్న షేక్ దర్బార్బాషా కుమారుడు అబూబకర్ (10) సోమవారం తెల్లవారుజామున మసీదులో నిద్రిస్తుండగా పాముకాటుకు గురై మృతి చెందినట్లు అబూబకర్ తల్లిదండ్రులు తెలిపారు.
రామాపురం, మే 10: మండల కేంద్రమైన రామాపురంలో నివాసం ఉంటున్న షేక్ దర్బార్బాషా కుమారుడు అబూబకర్ (10) సోమవారం తెల్లవారుజామున మసీదులో నిద్రిస్తుండగా పాముకాటుకు గురై మృతి చెందినట్లు అబూబకర్ తల్లిదండ్రులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాలను బట్టి రంజాన్ మాసంలో తన కుమారుడు ఉపవాసం ఉండి మసీదులో నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కట్లపాము కరవడంతో నిద్రమత్తులో ఉన్న అబూబకర్ దానిని గుర్తించలేక అలాగే నిద్రపోయాడు. పక్కనే పడుకుని ఉన్న ఒక వ్యక్తి కట్లపామును గుర్తించి చంపివేశాడు. కానీ పిల్లవానికి పాము కాటు వేసిందో లేదో తెలియక తల్లిదండ్రులు ఒక్కపొద్దులతో నీరసనంగా ఉన్నాడని భావించి కూల్డ్రింక్స్, టెంకాయలు తాగించారు. బాలుడి శరీరంలోకి విషం పాకి గొంతు పట్టేయడంతో అప్పుడు బాలుడిని పాము కాటేసిందనే అనుమానంతో హుటాహుటిన రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు అబూబకర్ను ఇంటికి తీసుకువచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు.