నీటికుంటలో పడి బాలుడి మృతి
ABN , First Publish Date - 2021-06-17T05:45:51+05:30 IST
ఈత కోసం వెళ్లి నీటికుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కిషన్నాయక్తండాలో బుధవారం చోటు చేసుకున్నది.
నాగల్గిద్ద, జూన్ 16 : ఈత కోసం వెళ్లి నీటికుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కిషన్నాయక్తండాలో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం తండాకు చెందిన అనిల్ (15) ఈత కోసం మరో బాలుడితో తండా శివారులోని నీటి కుంటకు వెళ్లారు. అనిల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గమనించిన మరో బాలుడు కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు హుటాహుటిన అక్కడికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లారు. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.