నాణ్యతతో వంతెనను నిర్మించాలి

ABN , First Publish Date - 2022-01-29T05:32:23+05:30 IST

మండల పరిధిలోని జాళ్లపాలెం పంచాయతీ మజారా ముసిలిపల్లి గ్రామానికి కానుగుల వాగుమీద వంతెన నిర్మాణం నాసిరకం ఇసుకతో కాంట్రాక్టు ఇష్టానుసారంగా నిర్మిస్తున్నాడని సీపీఎం మండల నాయకులు రాయళ్ల మాలకొండయ్య అన్నారు.

నాణ్యతతో వంతెనను నిర్మించాలి
నిర్మాణంలో ఉన్న వంతెన

వెలిగండ్ల, జనవరి 28: మండల పరిధిలోని జాళ్లపాలెం పంచాయతీ మజారా ముసిలిపల్లి గ్రామానికి కానుగుల వాగుమీద వంతెన నిర్మాణం నాసిరకం ఇసుకతో కాంట్రాక్టు ఇష్టానుసారంగా నిర్మిస్తున్నాడని సీపీఎం మండల నాయకులు రాయళ్ల మాలకొండయ్య అన్నారు. శుక్రవారం బ్రిడ్జి నిర్మాణాన్ని సీపీఎం పార్టీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రాయళ్ల మాలకొండయ్య మాట్లాడుతూ.. వెలుగొండ నుంచి పందువగండి చెరువుకు వచ్చే వాగు చాలా పెద్దదన్నారు. వంతెన నిర్మాణం మూడు కోణాలతో ఉత్తరం, దక్షణ నిర్మాణం జరుగుతుందన్నారు. కానీ ఇజనీరింగ్‌ అఽధికారులు సరిగ్గా గుర్తించకుండా ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారని విమర్శిస్తున్నారు. క్రాస్‌ లెవలింగ్‌ పెంచి వంతెన నిర్మాణం చేపడితే గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. నాసిరకం మెటీరియల్‌తో ఇష్టానుసారంగా నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజలకు ఉపయోగం లేకుండా పోతుందన్నారు. ఆయన వెంట కత్తి మోసే, రాయళ్ల రామయ్యలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-29T05:32:23+05:30 IST