అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. తల్లి ప్రాణాలను కాపాడుకున్నారు!

ABN , First Publish Date - 2021-02-28T02:30:05+05:30 IST

ఉన్నత జీవితం కోసం అమెరికా వెళ్లి.. అక్కడే స్థిరపడ్డ ఇద్దరు సోదరులు.. తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలుకుని తల్లడిల్లిపోయారు. అక్కడ నుంచి హుటాహుటిన పయనమై తల్లి ప్రాణాలను రక్షించుకున్న

అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. తల్లి ప్రాణాలను కాపాడుకున్నారు!

హైదరాబాద్: ఉన్నత జీవితం కోసం అమెరికా వెళ్లి.. అక్కడే స్థిరపడ్డ ఇద్దరు సోదరులు.. తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలుకుని తల్లడిల్లిపోయారు. అక్కడ నుంచి హుటాహుటిన పయనమై తల్లి ప్రాణాలను రక్షించుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తల్లి భారతమ్మ కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇది తెలుసుకున్న తాళ్లూరి జయశేఖర్, అతని సోదరుడు రాజాశ్రీనివాస్.. హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకుని తమ తల్లికి ధైర్యానిచ్చారు. విదేశాల నుంచి కొడుకులు రావడంతో భారతమ్మ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. మహమ్మారిని కూడా ఆమె జయించారు. ఈ క్రమంలో స్పందించిన తాళ్లూరి జయశేఖర్, రాజాశ్రీనివాస్.. తమ తల్లి కరోనాను జయించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. రాజాశ్రీనివాస్ అమెరికాలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. 


Updated Date - 2021-02-28T02:30:05+05:30 IST