బస్సు ఢీకొని వైద్యుడికి గాయాలు

ABN , First Publish Date - 2021-03-02T05:45:32+05:30 IST

శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద బస్సు ఢీకొనడంతో ఓ యువ వైద్యుడు గాయపడ్డారు. ఎస్‌.కోటకు చెందిన ఎం.రాఘు రామనాయుడు విశాఖ జిల్లా అనంతగిరి 108 వాహనంలో వైద్యుడిగా పని చేస్తున్నారు.

బస్సు ఢీకొని వైద్యుడికి గాయాలు

శృంగవరపుకోట, మార్చి 1: శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద బస్సు ఢీకొనడంతో ఓ యువ వైద్యుడు గాయపడ్డారు. ఎస్‌.కోటకు చెందిన ఎం.రాఘు రామనాయుడు విశాఖ జిల్లా అనంతగిరి 108 వాహనంలో వైద్యుడిగా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం ఎస్‌.కోట దేవిబొమ్మ కూడలి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఇన్‌ గేటు వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు వెనుక భాగంలోకి వాహనం వెళ్లింది. కొంతదూరం ఈడ్చుకుపోవడంతో తలకు, చాతి భాగం కింద తీవ్ర గాయాల య్యాయి. చికిత్స నిమిత్తం స్థానిక కోలపర్తి ఆసుపత్రికి 108 ద్వారా తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్టణం తరలించారు. 

 

Updated Date - 2021-03-02T05:45:32+05:30 IST