ఆర్టీసీ బస్సు, కారు ఢీ
ABN , First Publish Date - 2021-04-24T04:47:03+05:30 IST
మండలంలోని చెర్లోపల్లె గ్రామ సమీపంలోని గాలేరు నగరి సుజల స్రవంతి హెడ్రెగ్యులేటర్ వద్ద తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కారు శుక్రవారం ఢీ కొన్నాయి.
అవుకు, ఏప్రిల్ 23:
మండలంలోని చెర్లోపల్లె గ్రామ సమీపంలోని గాలేరు నగరి సుజల స్రవంతి
హెడ్రెగ్యులేటర్ వద్ద తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కారు
శుక్రవారం ఢీ కొన్నాయి. బస్సు తాడిపత్రిలో ఉదయం 4-45 గంటలకు బయలుదేరి అవుకు
మీదుగా కర్నూలుకు వెళ్లాల్సి ఉంది. బస్సు 5-45 గంటల ప్రాంతంలో
జీఎన్ఎస్ఎస్ హెడ్రెగ్యులేటర్ సమీపంలోకి వచ్చే సరికి విజయవాడ నుంచి
తాడిపత్రికి వెళ్తున్న కారు ఢీ కొన్నాయి. కారులో ఎయిర్ బెలూన్స్
తెరుచుకోవడంతో అందులోని వ్యక్తులు సురక్షితంగా బయట పడ్డారు. పోలీసులు ఘటనా
స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు
చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్కుమార్ తెలిపారు.