కారును ఢీకొన్న బస్సు, ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2020-12-02T05:26:30+05:30 IST

కొండపాక, డిసెంబరు 1 : కారును బస్సు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలోని లకుడారం స్టేజీ వద్ద రాజీవ్‌ రహదారిపై జరిగింది.

కారును ఢీకొన్న బస్సు, ముగ్గురికి గాయాలు

కొండపాక, డిసెంబరు 1 : కారును బస్సు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలోని లకుడారం స్టేజీ వద్ద రాజీవ్‌ రహదారిపై జరిగింది. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న కారును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, దేవి, రవీందర్‌కు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కుకునూర్‌పల్లి ఎస్‌ఐ సాయిరామ్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-02T05:26:30+05:30 IST