చెట్టును ఢీకొన్న బస్సు
ABN , First Publish Date - 2021-04-12T23:12:36+05:30 IST
జిల్లాలోని లక్సెట్టిపేట పట్టణంలో చెట్టును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో
మంచిర్యాల: జిల్లాలోని లక్సెట్టిపేట పట్టణంలో చెట్టును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. బస్సు వెళుతుండగా డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బస్సును రోడ్డు పక్కన ఆపే ప్రయత్నం చేశాడు. కానీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ చేస్తున్నారు.