లెక్క తేలింది
ABN , First Publish Date - 2021-04-23T04:25:49+05:30 IST
నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగియడం తో అచ్చంపేట మునిసిపల్ బరిలో 66 మంది అభ్యర్థులు నిలిచారు.
- బరిలో 66 మంది అభ్యర్థులు
అచ్చంపేట, ఏప్రిల్ 22: నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగియడంతో అచ్చంపేట మునిసిపల్ బరిలో 66 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరికివారు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. కాగా, స్వతంత్ర అభ్యర్థులుగా 2వ వార్డుకు విజయలక్ష్మి, రఫీ(11వ వార్డు), పసునూరి రామకృష్ణ(16), యాదయ్య(17), రవికుమార్(18), శ్రీదేవి(19వ వార్డు)కు పోటీలు నిలిచారు.