చెట్టును ఢీకొన్న కారు
ABN , First Publish Date - 2021-07-25T05:46:29+05:30 IST
కాపుసోంపురం వద్ద శనివారం మధ్యాహ్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు తీవ్రంగా గాయ పడ్డారు.
ఇద్దరు యువతులకు తీవ్రగాయాలు
గాయపడిన వారిది కడప, తాడేపల్లిగూడెం
అరకు విహారయాత్రకు వెళ్తుండగా ప్రమాదం
శృంగవరపుకోట రూర ల్ : కాపుసోంపురం వద్ద శనివారం మధ్యాహ్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు తీవ్రంగా గాయ పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నందితరెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన యశ్విత తమ స్నేహితులతో కలిసి విహారయాత్రకు కారులో విశాఖ నుంచి అరకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కాపుసోంపురం వచ్చేసరికి కారు ఆదుపుతప్పి పక్కనే ఉన్న తాటిచెట్లను ఢీకొని, వాటి మధ్యకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో నందితరెడ్డి, యశ్వీత తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కారులో ఉ న్న స్నేహితులు ఆటోలో ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికి త్స అనంతరం... పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేట్ అంబులెన్స్లో విశాఖ తరించారు. కారు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబు తున్నారు. కాగా ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ప్రమాద వివరాలు అందించాయి. కాగా, దీనిపై ఇంతవరకు ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ప్రసన్నకుమార్ తెలిపారు.