అధికారులపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-01-05T02:32:59+05:30 IST

జిల్లా అధికారుల తీరుపై ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా

అధికారులపై ఎస్టీ కమిషన్ చైర్మన్  ఆగ్రహం

చిత్తూరు: జిల్లా అధికారుల తీరుపై ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తవణంపల్లి మండలంలోని కుయ్య వంక ఎస్టీ కాలనీలో రవిబాబు పర్యటించారు. గిరిజన సమస్యలతో పాటు క్షేత్రస్థాయిలో పంటపొలాలను కమిషన్ చైర్మన్  పరిశీలించారు. తాను పర్యటనకు వస్తున్నానని విషయం తెలిసిన కూడా ఆయా శాఖలకు చెందిన అధికారులు సకాలంలో హాజరు కాకపోవడంపై నిప్పులు చెరిగారు.  అటవీశాఖ అధికారుల తీరు మరింత ఘోరంగా ఉండటంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో నాగయ్య కళాక్షేత్రంలో ఎస్సీలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-05T02:32:59+05:30 IST