వీఆర్‌ఏల జీవితాలతో చెలగాటం ఆడుతున్న సీఎం

ABN , First Publish Date - 2022-08-15T05:57:08+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీఆర్‌ఏల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు.

వీఆర్‌ఏల జీవితాలతో చెలగాటం ఆడుతున్న సీఎం
సంఘీభావం తెలుపుతున్న కేకే మహేందర్‌రెడ్డి

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 14 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీఆర్‌ఏల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణ  తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సమ్మెలో భాగంగా వీఆర్‌ఏలు చేస్తున్న నిరసన దీక్ష శిబిరాన్ని కేకే మహేందర్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా రెండు సార్లు వీఆర్‌ఏలకు  హామీలు ఇచ్చారని,  ఒక్కటి కూడా అమలు పరచకుండా తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వీఆర్‌ఏల గురించి ఎన్నో కబుర్లు చెప్పారని,  ఇప్పుడు వారిని గుర్తించక పోవడాన్ని కాంగ్రెస్‌ పక్షాన ఖండిస్తున్నామని అన్నారు. రాబోయే కాలం కాంగ్రెస్‌ కాలం వస్తుందని, కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌  జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, జిల్లా నాయకుడు వెల్ముల తిరుపతిరెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగెల రాజు, నాయకులు గుగ్గిళ్ల శ్రీకాంత్‌, కటకం రాజు, కొత్త రవి, పొన్నాల పర్శరాం, గుగ్గిళ్ళ భరత్‌, అరెపల్లి బాలు, నాగరాజు, తిరుపతి, వేణు, క్రాంతి, భాను, వీఆర్‌ఏ సంఘం సిరిసిల్ల డివిజన్‌ అధ్యక్షుడు రాధ శంకర్‌, మండల అధ్యక్షుడు కొంపెల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-15T05:57:08+05:30 IST