Kadapa: మల్లయ్యపల్లె గ్రామ సచివాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్

ABN , First Publish Date - 2022-04-27T16:09:52+05:30 IST

జిల్లాలోని ఖాజీపేట మండలం మల్లయ్యపల్లె గ్రామ సచివాలయానికి కాంట్రాక్టర్ వాసుదేవరెడ్డి తాళం వేశారు.

Kadapa: మల్లయ్యపల్లె గ్రామ సచివాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్

కడప: జిల్లాలోని ఖాజీపేట మండలం మల్లయ్యపల్లె గ్రామ సచివాలయానికి  కాంట్రాక్టర్ వాసుదేవరెడ్డి తాళం వేశారు. అధికారులు 5 శాతం పర్సంటేజ్ తీసుకొని బిల్లులు చేయకుండా నిర్లక్షం చేస్తుస్తున్నారని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయానికి తాళం వేయడంతో సచివాలయ ఉద్యోగులు బయట చెట్టుకింద సేద తీరుతున్నారు. రూ.48 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయానికి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా నేటికీ పూర్తి బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ వాసుదేవరెడ్డి ఆవేదన చెందారు.


Updated Date - 2022-04-27T16:09:52+05:30 IST