ఓరి నాయనో ఇదేం పకోడీరా నాయనా.. మరీ ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో..!

ABN , First Publish Date - 2021-11-08T02:05:55+05:30 IST

అహ్మదాబాద్‌లోని ఓ వీధిలో ఓ వ్యక్తి పకోడీలను వెరైటీగా చేసి, అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పకోడీలు చేసేందుకు శెనగపిండి వాడతామని అందరికీ తెలుసు. అయితే అలా చేస్తే స్పెషల్ ఏముందీ అనుకున్నాడో ఏమో.. అతను మాత్రం

ఓరి నాయనో ఇదేం పకోడీరా నాయనా.. మరీ ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో..!

కొందరు వంటలను విభిన్న రకాలుగా చేస్తుంటారు. అలాంటి వంట మాస్టర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అందరికీ తెలిసిన వంటలనే కొందరు కాస్త విభిన్నంగా చేస్తూ సరికొత్త రుచులను అందిస్తుంటారు. అలాంటి రుచులును ఆస్వాదించేందుకు.. భోజన ప్రియులు కూడా సిద్ధంగా ఉంటారు. అయితే ఓ వంట మాస్టర్ చేసిన సరికొత్త ప్రయోగం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. పకోడీలను సరికొత్తగా చేస్తూ.. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.


అహ్మదాబాద్‌లోని ఓ వీధిలో ఓ వ్యక్తి పకోడీలను వెరైటీగా చేసి, అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పకోడీలు చేసేందుకు శెనగపిండి వాడతామని అందరికీ తెలుసు. అయితే అలా చేస్తే స్పెషల్ ఏముందీ అనుకున్నాడో ఏమో.. అతను మాత్రం కొంచెం విభిన్నంగా ట్రై చేశాడు. శెనగపిండిలో ఓరియో బిస్కట్లను వేసి పకోడీలు చేస్తున్నాడు. బాగా వేయించిన అనంతరం పచ్చిమిర్చి, ఖర్జూరంతో కలిపి అందిస్తున్నాడు. ఆనోటా, ఈనోటా ఈ వార్త తెలుసుకుని జనం విపరీతంగా వస్తున్నారట. ప్రస్తుతం ప్లేట్‌ ఓరియో పకోడీని రూ.20 చొప్పున విక్రయిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Updated Date - 2021-11-08T02:05:55+05:30 IST