పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి శవం
ABN , First Publish Date - 2021-11-28T05:48:36+05:30 IST
ఆదోని-ఇస్వీ రైల్వే స్టేషన్ల మధ్య కేఎం నం.495/9-11 వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది.
ఆదోని, నవంబరు 27: ఆదోని-ఇస్వీ రైల్వే స్టేషన్ల మధ్య కేఎం నం.495/9-11 వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుబ్బరాయుడు వివరాల మేరకు.. బ్లూ కలర్ ప్యాంట్, రెడ్, బ్లాక్ పట్టీలు గల ఫుల్ చొక్కా ధరించి ఉన్నాడన్నారు. వయస్సు 45 నుంచి 50 మధ్య ఉంటుందని, శనివారం మధ్యాహ్నం పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడా, బహిర్భూమికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందా అన్నది తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.